: సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాధితులా? నిందితులా? అనేది చార్జిషీట్ లోనే తేలుస్తాం: అకున్ సబర్వాల్

డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాధితులా? లేక నిందితులా? అనే విషయం చార్జిషీట్ లోనే తేలుస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, పక్కా ఆధారాలు సేకరించామని, విచారణ వేగంగా కొనసాగుతోందని, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చార్జిషీట్ వేస్తామని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఎక్కడా స్కూళ్లు, కాలేజీల పేర్లు వెల్లడించలేదని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు త్వరలోనే వస్తుందని చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంలో విచారణ నిమిత్తం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకెవరినైనా పిలుస్తారా? అనే ప్రశ్నకు.. ‘నో కామెంట్స్’ అని అకున్ సమాధానమిచ్చారు.

More Telugu News