: కాపులు రాజకీయ రిజర్వేషన్లు కోరుకోవడం లేదంటూ చంద్రబాబు చిలకపలుకలు పలుకుతున్నారు: వైసీపీ నేతల ఆరోపణ

కాపులు రాజకీయ రిజర్వేషన్లు కోరుకోవడం లేదంటూ సీఎం చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని వైసీపీ నేతలు వంగవీటి రాధ, కిలారి రోశయ్య అన్నారు. కాపులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని, ‘తానా అంటే తందానా’ అనే బ్యాచ్ తో సమావేశం పెట్టి కొత్త డ్రామాకు చంద్రబాబు తెరలేపారని మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు కాపులను బీసీల్లోకి చేరుస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని, ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని, కాపులను ఎందుకు అరెస్ట్ చేసి బైండోవర్ చేస్తున్నారని  ప్రశ్నించారు. పింగళి దశరథరామ్, వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో చంద్రబాబుకు కాపులు బుద్ధి చెబుతారని అన్నారు.

More Telugu News