manchu manoj: ట్రైలర్ తో వచ్చేస్తోన్న మంచు హీరో!

మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ దర్శకత్వంలో 'ఒక్కడు మిగిలాడు' సినిమా తెరకెక్కుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో మనోజ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్ కి .. ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలను ముహూర్తంగా నిర్ణయించారు. మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించింది. ఈ సినిమా సక్సెస్ పైనే మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.      

More Telugu News