anjali: మలయాళంలో మరో చిత్రం చేస్తోన్న అంజలి!

తెలుగు .. తమిళ భాషా చిత్రాల కథానాయికగా అంజలి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఈ రెండు భాషల్లోను ఆమె కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలను చేయడం విశేషం. ఇక చాలా కాలం క్రితమే మలయాళ చిత్రాలపైన కూడా అంజలి ఓ కన్నేసింది. అక్కడ జయసూర్య సరసన 'పయ్యన్స్' అనే సినిమా చేసింది. ఆ సినిమా పరాజయం పాలు కావడంతో, అంజలి మరిన్ని ఛాన్సులు అందుకోలేకపోయింది.

కానీ ఇన్నాళ్లకు మళ్లీ అక్కడ చేసే అవకాశం ఆమెకి వచ్చింది. బిజూ మీనన్ కథానాయకుడిగా నటించే 'రోసాపూ'అనే సినిమాలో ఆమెను కథానాయికగా తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే మలయాళంలోను అంజలి తన సత్తాను చూపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.   

More Telugu News