: వారు చెప్పేది హంస మాటలు, చేసేది కోతి చేష్టలు: బాలకృష్ణ

ఈ ఉదయం నుంచి నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమిత్తం ప్రచార రంగంలోకి దిగిన హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, తనదైన శైలిలో రోడ్ షోను నిర్వహిస్తున్నారు. తన ప్రసంగాల్లో వైకాపాను దుయ్యబడుతున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన బాలయ్య, వారు చెప్పేది హంస మాటలని, చేసేది కోతి చేష్టలని అన్నారు. ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని, వారి ఉచ్చులో పడవద్దని కోరారు.

నంద్యాల నేత భూమా నాగిరెడ్డి బిడ్డలు కష్టాల్లో ఉన్నారని, వారికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల్లో భూమా వారసుడైన బ్రహ్మానందరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని, విపక్షాలను ఓటు తూటాతో కుప్పకూల్చాలని బాలయ్య పిలుపునిచ్చారు. ఆయన పర్యటన వెంకటేశ్వరపురంలో ప్రారంభమై, ప్రస్తుతం పల్లెల్లో సాగుతోంది. మధ్యాహ్నం తరువాత ఆయన నంద్యాల పట్టణంలో పర్యటించనున్నారు.

More Telugu News