sharvanand: జై లవ కుశ .. స్పైడర్ లతో పోటీ అంటే మాటలా?

దసరా పండుగ సందర్భంగా 'జై లవ కుశ' సెప్టెంబర్ 21వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇక సెప్టెంబర్ 27వ తేదీన 'స్పైడర్' సినిమా విడుదల కానుంది. కథాబలానికి టెక్నాలజీని తోడుచేసుకుని వస్తుండటం ఈ సినిమా స్పెషాలిటీ.

 ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ తప్పదని అంతా అనుకుంటూ ఉంటే, ఆ రెండు సినిమాల సరసన 'మహానుభావుడు' చేరిపోతున్నాడు. సెప్టెంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించాడు. కంటెంట్ పై గల నమ్మకంతోనే యూవీ క్రియేషన్స్ వారు ఈ సాహసం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. పెద్ద సినిమాలతో పోటీపడి సక్సెస్ ను సాధించే అలవాటు శర్వానంద్ కి ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండోయ్.    

More Telugu News