sai dhram tej: మెగా హీరో జోడీగా అనుపమ పరమేశ్వరన్!

అనుపమ పరమేశ్వరన్ అదృష్టవంతురాలేనని చెప్పాలి .. లేదంటే వరుసగా మూడు హిట్లను తన ఖాతాలో వేసుకునేదా? అందం .. అల్లరితనం .. అభినయం వున్న ఈ అమ్మాయికి తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. రామ్ సరసన ఆమె చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' .. విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

 సాయిధరమ్ తేజ్ కథానాయకుడుగా కరుణాకరన్ ఒక లవ్ స్టోరీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఇందులో అనుపమ పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ, ఈ పాత్ర అభిమానులకు ఆమెను మరింత చేరువ చేస్తుందని అంటున్నారు. కె.ఎస్. రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 

More Telugu News