: రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులు: నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రాజకీయ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత నేతల్లో రాజకీయ విలువలు నానాటికీ దిగజారుతున్నాయని ఆయన అన్నారు. ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన తర్వాత... అవతలి పార్టీ ఏదైనా ఆశ చూపితే, పార్టీ మారిపోతున్నారని... ఇది ముమ్మాటికీ అధికారాన్ని దుర్వినియోగపరచడమే అవుతుందని చెప్పారు.

జనం పార్టీ మీద అభిమానంతోనో, మీమీద నమ్మకంతోనో ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే పనిచేయాలని... పార్టీ మారిపోతే విలువలను వదులుకోవడమే అవుతుందని అన్నారు. నమ్మి ఓటేసిన ఓటర్లను మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మద్యం, డ్రగ్స్, ధూమపానం సినిమాలు రాకముందు నుంచే ఉన్నాయని... సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని చెప్పారు. ఏ రంగానికైనా క్రమశిక్షణ అనేది అవసరం అని తెలిపారు.

రాజకీయ నాయకుల్లో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి ఇద్దరూ గొప్ప నాయకులని సురేష్ బాబు తెలిపారు. నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకోవడంలో వీరికి ఎవరూ సాటిరారని కొనియాడారు. 

More Telugu News