: గుంటూరు జిల్లాలో బోరుబావిలో పడ్డ బాలుడు... ఆందోళనలో గ్రామస్తులు!

గుంటూరు జిల్లాలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిన ఘటన విషాదంలో ముంచుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో ఇంటి బయటకు ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు బోరుబావిలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాలుడు పడిన బోరుబావిలో తాడు వేసి 20 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాలుడ్ని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. 

More Telugu News