namrata: మహేశ్ భార్య మరోసారి క్లారిటీ ఇచ్చేసింది!

మహేశ్ బాబు భార్య నమ్రత వివాహానికి ముందు పలు హిందీ చిత్రాలలో కథానాయికగా నటించారు. చిరంజీవి కథానాయకుడిగా చేసిన 'అంజి' సినిమాతో తెలుగు తెరపై మెరిశారు. వివాహం తరువాత ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆమె నటించాలనుకుంటున్నట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి. అలాంటిదేం లేదంటూ అప్పుడే ఆమె వాటిని ఖండించారు.

 తాజాగా మహేశ్ 25వ మూవీ లాంచ్ చేసిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ విషయంపై ఆమె మరో మారు క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం తాను కుటుంబ వ్యవహారాలను చక్కబెడుతూ, మహేశ్ సినిమాలకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ చాలా బిజీగా వున్నానని చెప్పారు. అందువలన తనకి మళ్లీ తెరపైకి రావాలనే ఆలోచనే లేదని అన్నారు.   

More Telugu News