mahesh: మహేశ్ 25వ మూవీ మొదలైపోయింది!

మహేశ్ 25వ సినిమా ప్రారంభోత్సవ సమయం కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అశ్వనీదత్ - దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి, వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో కొంత సేపటి క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేశారు. మహేశ్ బాబు సతీమణి నమ్రతతో పాటు ఆయన పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేశ్ బాబు తనయుడు గౌతమ్ క్లాప్ కొడితే .. కూతురు సితార కెమెరా స్విచ్చాన్ చేసింది.  

ఈ సినిమాలో మహేశ్ న్యూ లుక్ తో కనిపించనున్నాడనీ .. ఇంతవరకూ ఆయన చేయని పాత్రను ఈ మూవీలో చేస్తున్నాడని చెబుతున్నారు. మహేశ్ కెరియర్లో ప్రత్యేకమైన సినిమా కనుక, ఈ సినిమా విషయంలో వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని అంటున్నారు. మహేశ్ మూవీ నుంచి ఆయన అభిమానులు ఆశించే కొత్తదనం ఈ సినిమాలో పూర్తిస్థాయిలో కనిపిస్తుందని చెబుతున్నారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను తీసుకున్నారు  .. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  

More Telugu News