: ఆ అభిమానంతోనే నంద్యాల ప్రచారంలో పాల్గొన్నా: సినీ హాస్యనటుడు వేణుమాధవ్

నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కోరారు. తెలుగుదేశం పార్టీ , భూమా కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని, ఆ అభిమానమే తనను నంద్యాలకు రప్పించిందని అన్నాడు. ఈ ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపించడమే భూమా నాగిరెడ్డికి సమర్పించే ఘన నివాళి అని  అన్నాడు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 37వ వార్డులో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో వేణుమాధవ్ పాల్గొన్నాడు.
 

 

More Telugu News