: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు వారి జీతాలు పెంచారా? : రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల వేతనాలను టీఆర్ఎస్ స‌ర్కారు అమాంతం పెంచేసిన అంశాన్ని లేవ‌నెత్తారు. ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌కుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు వీరి జీతాలు పెంచారా? అని ఆయ‌న నిలదీశారు. ప్రభుత్వ పక్షపాత ధోరణికి ఈ తీరే నిదర్శనమని, కేసీఆర్ తీరు ‘నచ్చితే నజరానా ఇస్తాం.. లేకుంటే జరిమానా విధిస్తాం’ అన్న‌ట్లు ఉంద‌ని ఎద్దేవా చేశారు. మ‌రోవైపు ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ఇప్ప‌టివ‌ర‌కూ నెర‌వేర్చ‌ని తెలంగాణ‌ స‌ర్కారు.. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల‌ జీతాలను ఏకంగా మూడురెట్లు పెంచ‌డమేంట‌ని ప్ర‌శ్నించారు.   

More Telugu News