meena: 'దృశ్యం' తరువాత మరోసారి తల్లి పాత్రలో మీనా!

తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం కథానాయికగా మీనాకి మంచి క్రేజ్ వుంది. అలాంటి మీనా రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి, తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వస్తోంది. అలా 'దృశ్యం; సినిమాలో టీనేజ్ అమ్మాయికి తల్లిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి అభినందనలు అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రంలోను ఆమె తల్లి పాత్రను పోషిస్తోందట.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి ఎపిసోడ్ ఉందట. ఆయన తల్లి పాత్రకి మీనా అయితే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ కే దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.  

More Telugu News