bellamkonda: 'జయ జానకి నాయక' పై ఆడియన్స్ టాక్!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' సినిమా, ఈ రోజున భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ జంటగా నటించిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బోయపాటి మార్క్ భారీతనం ఈ సినిమాలో కనిపించిందని అంటున్నారు.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గతంలో కంటే మెరుగైన నటనను ప్రదర్శించాడనీ, అయితే మరింత పరిణతి సాధించాల్సి ఉందని అంటున్నారు. ఇక డాన్సులు .. ఫైట్ల విషయంలో మాత్రం మంచి దూకుడు చూపించాడని చెబుతున్నారు. రకుల్ .. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారని అంటున్నారు. టెక్నీకల్ గా చూసుకుంటే దేవిశ్రీ సంగీతం .. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు. ఇక ఇప్పుడున్న పోటీలో ఈ సినిమా ఏ స్థానాన్ని దక్కించుకుంటుందో చూడాలి.      

More Telugu News