: వన్డేలకు దూరం కానున్న కోహ్లీ?

శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ కు కెప్టెన్ కోహ్లీ దూరమవుతున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్ లు ఆడుతున్న నేపథ్యంలోనే కోహ్లీతో పాటు మరికొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీతో పాటు జడేజా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, షమిలు వన్డే సిరీస్ కు దూరం కానున్నారు. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటన, శ్రీలంక పర్యటనల కారణంగా ఆటగాళ్లు పూర్తిగా అలసిపోయారు. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ పగ్గాలను చేపట్టే అవకాశం ఉంది. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, బసిల్ థంపిలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న తొలి వన్డే ప్రారంభం కానుంది. 12వ తేదీన శ్రీలంకతో చివరి టెస్టు మొదలుకానుంది.

More Telugu News