ntr: 'జై లవ కుశ' ఆ రోజున రావడం డౌటేనట!

ఎన్టీఆర్ కథానాయకుడిగా కల్యాణ్ రామ్ 'జై లవ కుశ' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగును పూర్తిచేసుకుంది. దసరాకి ఈ సినిమా థియేటర్స్ లో ఉండాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ రోజుకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

 ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా పనులు ఈ నెలాఖరుకు పూర్తి కావాలట. కానీ ఆ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. సెప్టెంబర్ 2వ వారానికి గానీ ఆ పనులు పూర్తయ్యే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఈ కారణంగా ఈ సినిమా అక్టోబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్ మాత్రమే. అధికారిక ప్రకటన వస్తేనే గాని .. ఒక స్పష్టత రాదు.    

More Telugu News