: ఎన్నికల సందర్భంగా నంద్యాలలో లైసెన్స్డ్ తుపాకులు పోలీసులకు అప్పగింత!

నంద్యాల ఉప ఎన్నికల వేళ, పోలీసు శాఖ ఆదేశాల మేరకు లైసెన్స్డ్ తుపాకులను కలిగివున్న వారు తమ తమ ఆయుధాలను పోలీస్ స్టేషన్లలో అందజేస్తున్నారు. ఇప్పటివరకూ 1208 తుపాకులు సంబంధిత పోలీస్ స్టేషన్లకు చేరాయని, మొత్తం 1214 మందిని బైండోవర్ చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 207 మందిపై సీఆర్పీ కేసులు పెట్టామని వెల్లడించారు. ఇప్పటివరకూ జరిగిన తనిఖీల్లో భాగంగా రూ. 4.8 లక్షలకు పైగా నగదు, ఓ బొలేరో వాహనం, నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News