: సీఐఐ ప్రెసిడెంట్‌ శోభ‌న కామినేనికి సుబ్బరామిరెడ్డి సత్కారం

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (సీఐఐకి) మొద‌టి మ‌హిళా ప్రెసిడెంట్‌గా అపోలో హాస్పిట‌ల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మ‌న్‌ శోభ‌న కామినేని ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్భంగా న్యూఢిల్లీలోని తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్‌లో గెట్ టు గెద‌ర్ ఏర్పాటు చేసి, ఈ కార్య‌క్ర‌మంలో ఆమెను రాజ్య‌స‌భ స‌భ్యుడు టి.సుబ్బ‌రామిరెడ్డి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో ఉన్న ఎన్నో స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కుంటూ శోభ‌న కామినేని చేసిన కృషిని అభినందించారు. 122 ఏళ్ల సీఐఐ చరిత్ర‌లో మొద‌టిసారి ఓ మ‌హిళ ఈ ప‌ద‌వికి ఎన్నిక అయ్యార‌ని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, చైనా, బెల్జియం, బ్రెజిల్‌తో పాటు ప‌లు దేశాల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

More Telugu News