boyapati: చిరూ .. బాలయ్య .. మహేశ్ లకు కథలు రెడీ చేశా : బోయపాటి

యాక్షన్ ఎంటర్టైనర్స్ ద్వారా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం బోయపాటికి బాగా తెలుసు. అలాంటి కథకి కాస్తంత లవ్ సెంటిమెంట్ ను కలిపి ఈ నెల 11న ఆయన 'జయ జానకి నాయక' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమాతో పాటు తన తదుపరి సినిమాలను గురించి మాట్లాడాడు.

 చిరంజీవి సినిమా కోసం కథ రెడీ చేయడం జరిగిపోయిందనీ, 'ఉయ్యాలవాడ' పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని అన్నాడు. ఇక బాలకృష్ణ సినిమాకి కూడా కథను రెడీ చేశాననీ, వచ్చే ఏడాది మే .. జూన్ లలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని చెప్పాడు. మహేశ్ మూవీకి కూడా కథ సిద్ధం చేశాననీ, అయితే ఇంకా ఆయనకి వినిపించలేదని అన్నాడు. ఆయనవి ఎక్కువ డేట్స్ అవసరమవుతాయి కనుక , ఆ సమయం కోసం ఎదురుచూడవలసి రావొచ్చని చెప్పాడు.  

More Telugu News