sai dharam thej: వినాయక్ తో తేజు న్యూ మూవీ మొదలైపోయింది!

మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' సినిమా చేసిన వినాయక్, తన తదుపరి సినిమా విషయంలో కొంత గ్యాప్ తీసుకున్నారు. సాయిధరమ్ తేజ్ తో ఆయన ఒక సినిమా చేసే ఛాన్స్  వున్నట్టుగా ఈ మధ్య వార్తలు వినిపించాయి. అది నిజమేనంటూ ఈ కాంబినేషన్ ఈ రోజున సెట్స్ పైకి వచ్చింది.

 సి. కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కొంతసేపటి క్రితం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో సాయిధరమ్ తేజ్ కి ఆశీస్సులు అందజేశారు.    

More Telugu News