sai dharam tej: మెగా హీరోతో వినాయక్ మూవీ లాంచ్ రేపే!

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలుకానుందనే వార్త కొంత కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించిన సందడి ఎక్కడా కనిపించకపోవడంతో ఉత్తుత్తి ప్రచారమేమోనని అనుకున్నారు. కానీ ఈ కాంబినేషన్లో సినిమా వుంది .. అది రేపే లాంచ్ కానుందనేది తాజా సమాచారం.

 చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150' చేసిన వినాయక్ .. నెక్స్ట్ మూవీని సాయి ధరమ్ తేజ్ తో చేయనుండటం విశేషం. ఆకుల శివ ఈ సినిమాకి కథను అందించారు. మెగా ఫ్యాన్స్ మెచ్చేలా ఈ కథ ఉంటుందని అంటున్నారు. పరుచూరి బ్రదర్స్ .. సత్యానంద్ లు స్క్రీన్ ప్లే పై వర్క్ చేస్తున్నారు. రేపు పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత, సమయం చూసుకుని మిగతా వివరాలను వెల్లడి చేస్తారట. వరుస పరాజయాలతో వున్న తేజుకి ఈ సినిమా హెల్ప్ అవుతుందేమో చూడాలి.  

More Telugu News