sai dharam tej: తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి వెళుతోన్న 'జవాన్'?

తొలినాళ్లలోనే మాస్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన సాయిధరమ్ తేజ్, 'తిక్క' .. 'విన్నర్' సినిమాల పరాజయంతో డీలాపడ్డాడు. ప్రస్తుతం చేస్తోన్న 'జవాన్' సినిమాపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. బీవీఎస్ రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు.

 అయితే వాళ్లు ఊహించని విధంగా 'పైసా వసూల్' అదే రోజుని విడుదల తేదీగా ఖరారు చేసుకుంది. దాంతో 'జవాన్'  విడుదల తేదీని మార్చుకున్నట్టుగా సమాచారం. ' పైసా వసూల్' నుంచి దసరా బరిలో దిగే సినిమాలు వరుసగా వున్నాయి. ఆ సమయంలో రంగంలోకి దిగితే థియేటర్లపై .. వసూళ్లపై ప్రభావం పడుతుంది. అందువలన అక్టోబర్ 1వ తీదీన విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి వుంది.    

More Telugu News