: ఆరేళ్ల పాటు తన భర్త టార్చర్ పెట్టాడన్న టాలీవుడ్ సింగర్ కౌసల్య!

ఆరేళ్లపాటు తన భర్త తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేశాడని టాలీవుడ్ సింగర్ కౌసల్య ఆరోపించింది. ఆయన వల్ల తాను నరకయాతన అనుభవించానని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'నీ కోసం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కౌసల్య ఇప్పటి వరకు 400లకు పైగా సినిమాల్లో పాటలు పాడింది.

అప్పటి వరకు హాయిగా కొనసాగిన కౌసల్య జీవితం... పెళ్లి తర్వాత కుదుపులకు గురైంది. సొంత ఇష్టాలకు దూరంగా ఉండాలంటూ ఆమెపై ఒత్తిడి ఎక్కువైంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, తనకు ఏమాత్రం స్వేచ్ఛ ఉండేది కాదని... భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యుల నుంచి ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది.

More Telugu News