bellamkonda: భారీస్థాయి రిలీజ్ కి సిద్ధంగా 'జయ జానకి నాయక'

 బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' సినిమా తెరకెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ జంటగా రూపొందిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారు. దాంతో భారీ స్థాయి రిలీజ్ దిశగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

 ఫైనల్ గా రన్ టైమ్ 149 నిమిషాలు .. అంటే దాదాపు రెండున్నర గంటలు ఉన్నట్టుగా చెబుతున్నారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు సున్నితమైన ప్రేమకి సంబంధించిన ఎపిసోడ్స్ ను సైతం అద్భుతంగా చిత్రీకరించాడని అంటున్నారు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వున్నారు. భారీ రిలీజ్ కి తగినట్టుగానే భారీ సక్సెస్ ను కూడా సొంతం చేసుకుంటుందేమో చూడాలి. 

More Telugu News