: టీవీ9 యాంకర్ పై సీరియస్ అయిన రానా.. పిచ్చి పిచ్చి క్వశ్చన్ లు వేయొద్దంటూ వార్నింగ్!

ప్రముఖ సినీ నటుడు రానా సహనం కోల్పోయాడు. తనను ప్రశ్నించిన టీవీ9 మహిళా యాంకర్ పై సీరియస్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, రానాతో టీవీ9 ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా యాంకర్ మాట్లాడుతూ, సెలబ్రెటీలుగా ఉన్నవారిపై పూలు పడుతుంటాయ్, రాళ్లు కూడా పడుతుంటాయ్... పూలు పడినప్పుడు బాగానే ఉంటుందని, రాళ్లు పడినప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంటుందని చెప్పింది.

ఇటీవల కాలంలో టాలీవుడ్ ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోందని... మీ ఇంటికి కూడా ఏదో పార్శిల్ వచ్చిందని, ఎక్సైజ్ అధికారులు మీ ఇంటికి వచ్చారనే వార్తలు వచ్చాయని... అసలేం జరిగిందని ప్రశ్నించింది. అప్పటికే రానా ముఖ కవళికలు మారిపోయాయి. చివరకు తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. యాంకర్ పై చిటిక వేస్తూ, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్ లు వేయద్దంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. రానా సమాధానంతో యాంకరమ్మ బిత్తరపోయింది. కిందున్న వీడియో మీరూ చూడండి. 

More Telugu News