charan: పల్లెటూరు సెట్లో సందడి చేస్తున్న చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగస్థలం 1985' పక్కా గ్రామీణ వాతావరణంలో రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. అక్కడ వేసిన పల్లెటూరి సెట్లో చరణ్ .. జగపతిబాబు తదితరులు పాల్గొంటుండగా కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకుల హృదయాలకి హత్తుకునేలా సుకుమార్ ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడట.

అక్టోబర్ చివరినాటికి షూటింగును .. నవంబర్ నాటికి అన్ని పనులను పూర్తి చేస్తారట. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న కథ కనుక మొదట్లో దీనిని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాల పోటీ ఎక్కువగానే వుంది కనుక, కాస్త ముందుగా 'క్రిస్మస్' కి విడుదల చేసే ఆలోచన ప్రస్తుతం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ కానుందని చెప్పుకుంటున్నారు.  

More Telugu News