: ఇనుప మెట్ల నిర్మాణంలో వెనక్కి తగ్గిన టీటీడీ!

తిరుమలలో వెండివాకిలి పక్కన ఇనుపమెట్ల నిర్మాణాన్ని చేబట్టాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఆగమశాస్త్రం నిబంధనలకు ఇది విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో టీటీడీ వెనక్కి తగ్గింది. ఈ విషయమై టీటీడీ పునరాలోచనలో పడింది. మెట్ల తొలగింపు కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. కాగా, భక్తుల రద్దీ ఉన్న సమయంలోనే ఈ మెట్లను వినియోగిస్తామని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పేర్కొనడం, ఆగమశాస్త్రం ప్రకారమే వీటి నిర్మాణ జరిగిందని ఆయన చెప్పడం విదితమే.

More Telugu News