varun: బాక్సాఫీసు 'ఫిదా': అరవై కోట్ల వసూళ్లు!

కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ చిత్రాలను రూపొందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తీసిన తాజా చిత్రం 'ఫిదా'. వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని సాధిస్తోంది. జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం 60 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే నిర్మాత దిల్ రాజుకు ఈ చిత్రం భారీ లాభాలనే తెచ్చిపెట్టిందని చెప్పచ్చు. అలాగే, దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా దీనిని పేర్కొంటున్నారు.     

More Telugu News