: నాకు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు: గోపాలకృష్ణ గాంధీ

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాను అంచనా వేసినట్టే జరిగిందని, అయితే, తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి, పరాజయం పొందిన గోపాలకృష్ణ గాంధీ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, ఆయన మాట్లాడుతూ, విపక్ష పార్టీలు కలసికట్టుగా వ్యవహరించి, తమ సత్తా చాటుతాయని అంచనా వేసినట్టే జరిగిందని అన్నారు.

అయితే, తాను అనుకున్న దాని కంటే ఎక్కువగానే సంతృప్తి పొందానని అన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన వెంకయ్యనాయుడుని ఆయన అభినందించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, గెలుపోటములు ఎలా ఉన్నా సిద్ధాంతాల విషయంలో విపక్షాలు రాజీపడవని, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఓటేసిన వారందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

More Telugu News