megha akash: రామ్ మూవీ నుంచి మేఘా ఆకాశ్ అందుకే తప్పుకుందట!

మంచి కథ కోసం కొంత కాలం వెయిట్ చేసిన రామ్, కిషోర్ తిరుమల వినిపించిన కథపై గల నమ్మకంతో రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో కథానాయికలుగా అనుపమ పరమేశ్వరన్ ను .. మేఘా ఆకాశ్ ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి మేఘా ఆకాశ్ తప్పుకుంది.

నితిన్ 'లై' మూవీకి ఏకధాటిగా 75 రోజులు కేటాయించవలసి వచ్చిందనీ, అందువలన రామ్ సినిమాను వదులుకోవలసి వచ్చిందని మేఘా ఆకాశ్ చెప్పింది. నితిన్ తోనే మరో సినిమాను అంగీకరించడం .. గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేయనుండటం కూడా ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని అంది. అయితే రామ్ సినిమాలో మేఘా ఆకాశ్ కి దక్కింది రెండవ కథానాయిక స్థానం కావడం వల్లనే ఆమె తప్పుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠిని సంప్రదించేది ఈ పాత్ర కోసమే!  

More Telugu News