varin tej: పెట్టుబడిపై నాలుగు రెట్లు తెచ్చిన 'ఫిదా'?

దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ .. సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను మంచి ఆదరణ లభిస్తోంది. పక్కా ప్లానింగ్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించారు.

 ఫుల్ రన్ లో 25 నుంచి 30 కోట్ల వరకూ రాబట్టవచ్చని అనుకున్నారు. కానీ అంచనాలకి మించి ఈ సినిమా రెండు వారాల్లోనే 32 కోట్ల షేర్ ను రాబట్టింది. 'ఫిదా' తరువాత వచ్చిన సినిమాలు ఆదరణ పొందకపోవడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ క్లబ్ కి చేరువలో ఉందనీ .. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 40 కోట్ల షేర్ మార్క్ ను అందుకోనుందని అంటున్నారు. ఈ వీకెండ్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరు చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

More Telugu News