charan: చరణ్ వల్లనే సాధ్యమైందంటూ ఆయనకి థ్యాంక్స్ చెప్పిన సుకుమార్!

సుకుమార్ నిర్మాతగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో, అశోక్ - ఈషా రెబ్బా జంటగా 'దర్శకుడు' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది చిన్న సినిమా అయినా .. హీరో హీరోయిన్లకి క్రేజ్ లేకపోయినా, సినిమా మాత్రం అందరి దృష్టిలో పడిందని, అందుకు కారకుడు చరణ్ అని సుకుమార్ చెప్పాడు.

ఈ సినిమాకి క్రేజ్ రావడం కోసం ఫస్టు టికెట్ ను చిరంజీవి కొనేలా చేశారు. ఈ విషయాన్ని గురించి సుకుమార్ మాట్లాడుతూ, తాము ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెగాస్టార్ రావడం, ఫస్టు టికెట్ ను కొనడం అంత తేలికైన పని కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయనని ఒప్పించి రప్పించిన ఘనత చరణ్ దేనని చెప్పాడు. అందుకు ఆయనకి తాను థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'రంగస్థలం 1985' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News