: కాపులకు రాజకీయ రిజర్వేషన్లు ఉండవని చంద్రబాబు చెప్పారు: అచ్చెన్నాయుడు

ఎట్టి పరిస్థితుల్లోను బీసీలకు అన్యాయం జరగదని... అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండానే కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని ఆయన చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్లే కాపు రిజర్వేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని తెలిపారు. అయితే కాపులకు రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉండవని... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారని అన్నారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవిధంగా స్పందించారు.

More Telugu News