: తిరుపతికి తుపాకులతో వచ్చిన భక్తుల అరెస్ట్... తమవారు కొండపై ఉన్నారని చెప్పడంతో రెడ్ అలర్ట్!

ఈ ఉదయం తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ముగ్గురు భక్తుల నుంచి ఓ తుపాకి, 14 తూటాలు లభ్యం కావడం కలకలం రేపింది. పోలీసుల సాధారణ తనిఖీల్లో భాగంగా 'ఎంహెచ్ 21 ఎపి 8055' నంబర్ గల కారులో ఇవి లభ్యం కావడంతో, పుణెకు చెందిన ముగ్గురు భక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. తమ వారు కొండపై ఉన్నారని, వారి కోసమే వచ్చామని వీరు చెప్పడంతో, పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయగా, తిరుమల అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. గాలిగోపురంతో పాటు తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో నిఘా భద్రతా విభాగం సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై మరింత సమాచారం తెలియాల్సి వుంది.

More Telugu News