: యూరోప్ లోని ప్రధాన నగరాలకు జెట్‌ఎయిర్‌వేస్‌ ఆఫర్లు!

భారత్ ను యూరోప్ లోని అన్ని నగరాలకు చేరువ చేసే లక్ష్యంతో జెట్ ఎయిర్ వేస్ నాన్ స్టాప్ విమాన సర్వీసులను, వన్ స్టాప్ రిటర్న్ ఛార్జీలను ప్రకటించింది.  సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. ప్రత్యేకమైన అన్ని పన్నులు సహా ఎకానమి క్లాస్ కు రూ.39,990, ప్రీమియం క్లాసులో రూ.99,990 కే ప్రయాణం చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. అక్టోబరు 29వ తేదీ నుంచి చెన్నై-పారిస్, బెంగళూరు-ఆమ్ స్టర్ డామ్, ముంబై- లండన్ హీత్రూ నాన్ స్టాప్ సేవలపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

More Telugu News