: నాలాలో పోలీసుల వెతుకులాట... విక్రమ్ గౌడ్ ను కాల్చిన గన్ కోసం తిప్పలు!

హైదరాబాదులోని షేక్ పేట్ నాలాలో పోలీసులు గాలింపు చేపట్టారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిపింది ఆయన స్నేహితులేనని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నామని చెప్పిన పోలీసులు, విక్రమ్ గౌడ్ ను కాల్చిన తుపాకీ కోసం గాలింపు చేపడుతున్నట్టు చెబుతుండడంతో ఈ కేసులో సస్పెన్స్ వీడిందా? లేదా? అన్న అనుమానాలు రేగుతున్నాయి.

విచారణలో నిందితులు తుపాకీని పారేశామని చెబుతున్నట్టుగా షేక్ పేట్ నాలాలో జీహెచ్ఎంసీ సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టారు. ఇది దొరికితే ఈ కేసు విచారణలో మరింత పకడ్బందీ సాక్ష్యాలు సేకరించినట్టు అవుతుందని చెబుతున్నారు. కాగా, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు సూచిస్తోందని వారు తెలిపిన సంగతి తెలిసిందే. 

More Telugu News