: బంధుత్వాన్నే వదులుకున్న వాడిని.. టీడీపీ, బీజేపీ స్నేహమెంత? : పవన్ కల్యాణ్

అక్టోబర్ తరువాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. వారంలో మూడు రోజులు రాజకీయ కార్యక్రమాల్లోనే పాల్గొంటానని చెప్పారు. నిర్మాతలను ఖాళీ సమయాల్లో సినిమాలు తీయమని కోరుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. టీడీపీకి తాను రహస్య స్నేహితుడిని కాదని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశానని ఆయన అన్నారు. అలాంటప్పుడు రహస్య స్నేహం ఏముందని అన్నారు.

అయితే ప్రజలు ఒకటి గుర్తించాలని పవన్ చెప్పారు. అభిప్రాయాలు కుదరక బంధుత్వాన్నే కాదనుకున్న వాడినని, అలాంటిది ఈ స్నేహాలు ఎంత? అని ఆయన ప్రశ్నించారు. తనకు ప్రజలు, ప్రజా సమస్యలే ముఖ్యమని ఆయన చెప్పారు. ఆ తరువాతే ఎలాంటి బంధాలైనా అన్నారు. పార్టీ ఫిరాయింపులు దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న రీతిలో తయారయ్యాయని ఆయన చెప్పారు. ఒకప్పుడు విలువలు కలిగిన రాజకీయాలు ఉండేవని, ఇప్పుడు విలువలు లేని రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని ఆయన తెలిపారు.  

More Telugu News