: సరికొత్త రికార్డుకు చేరుకున్న సెన్సెక్స్!

భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. రేపు నిర్వహించనున్న పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 32,515కి ఎగబాకింది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 10,077కు చేరుకుంది.

బీఎస్ఈ లో ఇవాల్టి టాప్ గెయినర్స్...
ఇన్ఫి బీమ్ ఇన్ కార్పొరేషన్ (8.58%), శ్రీ సిమెంట్ (7.26%), బల్రామ్ పూర్ చిన్ని మిల్స్ (6.54%), టోరెంట్ ఫార్మా (5.62%), సిటీ యూనియన్ బ్యాంక్ (5.55%).  

టాప్ లూజర్స్...
వీ గార్డ్ (-8.08%), ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ (-5.17%), మార్క్ సాన్స్ ఫార్మా (-4.49%), అడ్వాన్స్ డ్ ఎంజైమ్ టెక్నాలజీస్ (-4.31%), ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (-4.08%). 

More Telugu News