venkatesh: 'పైసా వసూల్' హిట్ అయితే పూరీతోనే వెంకీ మూవీ?

వెంకటేశ్ హీరోగా చేసిన 'గురు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలాకాలమే అయింది. ఆ తరువాత వెంకటేశ్ నెక్స్ట్ మూవీ ఏ దర్శకుడితో చేయనున్నాడనే విషయంపై అభిమానులు దృష్టి పెట్టారు. అలాంటి అభిమానులకు ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే వెంకటేశ్ ఏ ప్రాజెక్టును ఓకే చేయలేదు.

బాలకృష్ణ కంటే ముందు వెంకటేశ్ తోనే పూరీ ఒక సినిమా చేయాల్సి వుంది. బడ్జెట్ విషయంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదనే టాక్ అప్పట్లో వచ్చింది. ఆ తరువాత బాలకృష్ణతో 'పైసా వసూల్' చేసిన పూరీ .. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ సినిమా హిట్ అయితే .. గతంలో పూరీతో అనుకున్న ప్రాజెక్టును పట్టాలెక్కించాలని వెంకటేశ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక రానాతో కలిసి ఆయన ఒక మల్టీస్టారర్ చేయనున్నాడనే ప్రచారం జరుగుతూ ఉండటం విశేషం.    

More Telugu News