: విక్రమ్ ఇంట్లో ఆయుధం దొరకలేదు... ఇంట్లో వాళ్లే దాచేశారన్న అనుమానం: డీసీపీ వెంకటేశ్వరరావు

ఈ తెల్లవారుజామున మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులకు ఇప్పటివరకూ ఎటువంటి క్లూ లభించలేదు. కాల్పులు ఇంట్లోనే జరిగినట్టు స్పష్టమవుతున్నా, కాల్పులకు ఉపయోగించిన రివాల్వర్ ను ఇంతవరకూ స్వాధీనం చేసుకోలేకపోయామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. ఆయుధాన్ని ఇంట్లోని వారే దాచేశారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

దీంతో ఆయనపై కాల్పులు జరిపింది దగ్గరి బంధువులు లేదా తెలిసిన వారే అయ్యుండవచ్చన్న అనుమానానికి బలం చేకూరుతోందని అన్నారు. మరోవైపు విక్రమ్ సైతం తమకు ఏ విషయమూ చెప్పడం లేదని, తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఆయన ఉద్దేశపూర్వకంగానే తప్పిస్తున్నట్టు అనిపిస్తోందని తెలిపారు. ఆయన నోరు విప్పితేనే నిందితుడు బయటకు వస్తాడని అన్నారు. విక్రమ్ ఇంట్లో కాల్పుల సమయంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తామని తెలిపారు.

More Telugu News