: మా పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు: లాలూ ప్రసాద్ యాదవ్

బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఈ సంఘటనతో ఇన్నాళ్లూ కొనసాగిన జేడీయూ, ఆర్జేడీల పొత్తుకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ, ‘తేజస్విపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాత్రమే నితీశ్ అడిగారు తప్పా, రాజీనామా చేయాలని కోరలేదు. తేజస్విపై తప్పుడు ఆరోపణలు చేశారని నితీశ్ కు చెప్పాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో నితీశ్ కలిశారు. ఎందుకంటే, నితీశ్ రాజీనామా చేయగానే ప్రధాని మోదీ ట్వీట్ చేసి అభినందించడమే ఇందుకు నిదర్శనం. బీహార్ శాసనసభలో పెద్దపార్టీ మాదే. మా పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు’ అని అన్నారు.

More Telugu News