: 41 ఓవర్లలోనే 200... ఏం చేయాలో పాలుపోని స్థితిలో లంక బౌలర్లు

శ్రీలంకలోని గాలే టెస్టులో బౌండరీలు వర్షంలా కురుస్తున్న వేళ, టెస్టు మ్యాచ్ వన్డే మ్యాచ్ లా కనిపిస్తుండగా, 41వ ఓవర్ లోనే భారత స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. అది కూడా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి. భారత తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకూ 27 ఫోర్లు రావడం విశేషం. అంటే మొత్తం స్కోరులో సగానికి పైగా పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ప్రస్తుతం ధావన్ 132 బంతుల్లో 20 ఫోర్లతో 127, పుజారా 92 బంతుల్లో 5 ఫోర్లతో 59 పరుగులు చేయగా, వీరిలో ఎవరు అవుటైనా కెప్టెన్ విరాట్ కోహ్లీ రంగంలోకి దిగనున్నాడు. ఆపై రహానే, పాండ్యా, సాహా, అశ్విన్, జడేజా ఉండటంతో, భారత్ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత స్కోరు 41 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 201 పరుగులు.

More Telugu News