: ‘పాక్’లో ఆత్మాహుతి దాడి.. 22 మంది మృతి!

పాకిస్థాన్ లోని లాహోర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందారు. లాహోర్ సిటీలోని పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి అతి సమీపంలోని అర్ఫాకరీమ్ టవర్ వద్ద ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సీఎం తన అధికారిక నివాసంలో సమావేశంలో ఉండగా ఈ దాడి జరిగింది. ఈ సంఘటనలో ముప్ఫై మందికి పైగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా లాహోర్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ, పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News