: నేడు గెలిస్తే, సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ... మిథాలీకి బంపరాఫర్

నేడు ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోరులో గెలిస్తే, మిథాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందిస్తానని మాజీ క్రికెటర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ కారును సచిన్ చేతుల మీదుగా ఇప్పించే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఆఫర్ ఇచ్చినట్టు అన్నారు. కాగా, గతంలో రియో ఒలింపిక్స్ లో దేశ ఖ్యాతిని చాటిన పీవీ సింధు, దీపా కర్మాంకర్, సాక్షి మాలిక్ లకు చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, నేటి మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.

More Telugu News