: రూ.3,499కే కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల!

భార‌తీయ మార్కెట్లో బ‌డ్జెట్ ధ‌ర‌లో మ‌రో స్మార్ట్‌ఫోన్ విడుద‌లైంది. 4జీ వీవోఎల్‌టీఈ సదుపాయంతో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామ‌ర్థ్యంతో రూ.3,499కే దేశీయ‌ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ‘ఐవూమీ మి4’ స్మార్ట్‌ఫోన్‌ ను అందుబాటులో ఉంచారు. ఇది చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారి సంస్థ ఐవూమీకి చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్‌.
 
ఐవూమీ మి4 ఫీచ‌ర్లు...

  •  4.55 ఇంచ్ డిస్‌ప్లే
  •  854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  •  1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
  •  1 జీబీ ర్యామ్
  •  8 జీబీ స్టోరేజ్
  •  64 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  •  ఆండ్రాయిడ్ 7.0 నూగట్
  •  డ్యుయల్ సిమ్
  •  5 మెగాపిక్సల్ వెనుక‌ కెమెరా
  •  5 మెగాపిక్సల్ ముందు కెమెరా

More Telugu News