puri jagannadh: 'జన గణ మన' చేసి తీరతానంటోన్న పూరీ జగన్నాథ్!

పూరీ జగన్నాథ్ కొంతకాలం క్రితం మహేశ్ బాబు కథానాయకుడిగా తాను 'జన గణ మన' సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. మహేశ్ బాబు లుక్ తో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అన్నాడు. అయితే వరుస సినిమాలతో మహేశ్ బిజీగా ఉండటం వలన .. పూరీ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు.

మళ్లీ ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి ఆయన ప్రస్తావించాడు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటోన్న పరిణామాల కారణంగా ఈ కథను తెరకెక్కించాలనే పట్టుదల తనలో మరింత పెరిగిందని ఆయన అన్నాడు. దేశంలో వున్న అనేక రకాల సమస్యలు ఈ స్క్రిప్ట్ లో చోటుచేసుకుంటాయని చెప్పాడు. 'ఐ లవ్ ఇండియా .. ఐ హేట్ ఇండియన్స్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్ అనీ .. ఇలా ఎందుకు పెట్టాననేది ఈ సినిమా చూసిన తరువాత అర్థమవుతుందని చెప్పుకొచ్చాడు.    

More Telugu News