Rashi khanna: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  తెలుగు సినిమాలో ఒకప్పుడున్న పరిస్థితి ఇప్పుడు బాగా మారింది.. అంటోంది అందాలతార రాశి ఖన్నా. "ఒకప్పుడు తెలుగు సినిమా అంటే హీరో ఓరియెంటెడ్. హీరోయిన్ పాత్రకి పెద్దగా స్కోప్ వుండేది కాదు. అయితే, ఇటీవలి కాలంలో బాగా మార్పు వచ్చింది. హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. 'సుప్రీం'లో నేను చేసిన పాత్రే అందుకు ఉదాహరణ. ఇది హర్షించదగ్గ పరిణామం' అని చెప్పింది.
*  బి.జయ దర్శకత్వంలో బి.ఏ.రాజు నిర్మించిన 'వైశాఖం' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రం  ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను హైదరాబాదులో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున విచ్చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
*  మహేశ్ బాబు నటించే 'భరత్ అను నేను' చిత్రంలో అందాల అనుష్క ఐటెం సాంగ్ చేస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చిన సంగతి విదితమే. ఇందులో ఆ పాట చేస్తున్నందుకు అమ్మడు కోటి రూపాయలు తీసుకుంటోందని కొందరు, కాదు రెండు కోట్లు అని మరికొందరు అంటున్నారు. ఏమైనా, పెద్ద మొత్తంలోనే చార్జి చేస్తోందట. 

More Telugu News