: ఎంపీలయినా ఓటు వేయలేకపోయిన సచిన్, రేఖ, సుబ్రహ్మణ్యస్వామి!

రాజ్యసభ సభ్యులైనప్పటికీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాక్సర్ మేరీకోమ్, నటి రేఖ, బీజేపీ సినియర్ నేత సుబ్రహ్మణ్యస్వామిలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. దీనికి కారణం వారు నామినేటెడ్ ఎంపీలు కావడమే. రాష్ట్రపతి వీరిని నామినేట్ చేశారు. రాజ్యసభలో 12 మందిని, లోక్ సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఈ 14 మందికి ఓటు వేసే హక్కు ఉండదు. ప్రస్తుతం రాజ్యసభలో ఈ నలుగురితో పాటు నటి రూపా గంగూలీ, నటుడు సురేష్ గోపి, నరేంద్ర జాదవ్, స్వపన్ దాస్ గుప్తా, అను ఆగా, పరాశరణ్, కేటీఎస్ తులసి, శంభాజీ రాజేలు నామినేటెడ్ ఎంపీలుగా ఉన్నారు.

More Telugu News