: గ్రామ‌స్తులంతా క‌లిసి అడ్డుకున్నా... కోదండ‌రామ్‌ను అరెస్టు చేసిన పోలీసులు

టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్‌ను ఈ రోజు పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఆయన సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో ప‌ర్య‌టించారు. ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు కోదండ‌రామ్‌తో తమ బాధ‌లు చెప్పుకున్నారు. రైతుల‌తో చ‌ర్చించిన అనంత‌రం బైలంపూర్‌లో బాధిత రైతులను పరామర్శించే క్రమంలో ఓ రైతు ఇంట్లోకి ఆయ‌న వెళ్లారు. దీంతో కోదండరామ్‌ను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే, కోదండ‌రామ్‌ను అరెస్టు చేయ‌కూడ‌ద‌ని గ్రామ‌స్తులు అడ్డుప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ వారంద‌రినీ చెద‌ర‌గొట్టిన పోలీసులు కోదండ‌రామ్‌ను అక్క‌డి నుంచి తీసుకెళ్లారు. 

More Telugu News